యాప్నగరం

రాజాసింగ్ రోడ్ షోలో ఘర్షణ.. టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత

GHMC Elections: రోడ్‌షో కొనసాగుతున్న సమయంలో అదే దారిలో వచ్చిన టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా గట్టిగా నినాదాలు చేశారు. అంతేకాక, బీజేపీ నాయకులు వెనక్కి వెళ్లిపోవాలంటూ అరిచారు.

Samayam Telugu 27 Nov 2020, 3:00 pm
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొన్న గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రోడ్‌ షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీ నుంచి రాజాసింగ్‌ రోడ్‌ షో ప్రారంభమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. రోడ్‌షో కొనసాగుతున్న సమయంలో అదే దారిలో వచ్చిన టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా గట్టిగా నినాదాలు చేశారు. అంతేకాక, బీజేపీ నాయకులు వెనక్కి వెళ్లిపోవాలంటూ అరిచారు. అందుకు ప్రతి స్పందనగా బీజేపీ శ్రేణులు కూడా నినాదాలు చేశారు. నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
Samayam Telugu రాజాసింగ్
raja singh


ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలను వెనక్కి వెళ్లిపోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు.

రోడ్ షోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలుస్తుందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎంఐఎం, టీఆర్ఎస్‌లేనని అన్నారు. అక్రమ చొరబాటు దారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తించి.. తన ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారని విమర్శించారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.