యాప్నగరం

Hydలో టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పరస్ఫర తోపులాటలు

Musheerabad: కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేస్తున్న సమయంలోనే అటుగా వెళ్తున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను వారు అడ్డుకున్నారు. రాజ్ కుమార్ ఇంటి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 11 Oct 2020, 7:37 pm
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అది తోపులాటలకు కూడా దారి తీసింది. శుక్రవారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి సెల్లార్‌లో చేరిన వర్షపు నీటితో షార్ట్ సర్క్యూట్ జరిగి ఓ వ్యక్తి చనిపోయాడు. ఇతను హైకోర్టు ఉద్యోగి రాజ్ కుమార్. దీంతో రాజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్‌లోని ఆయన ఇంటి ముందు యువజన కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tensions between trs and congress


కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేస్తున్న సమయంలోనే అటుగా వెళ్తున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను వారు అడ్డుకున్నారు. రాజ్ కుమార్ ఇంటి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నేతలు ఒకరినొకరు తోసుకోసున్నారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.