యాప్నగరం

ఖైరతాబాద్ గణేష్ ఎదుట ఉద్రిక్తత.. ఘర్షణకు అదే కారణం

Khairatabad: దర్శనానికి వచ్చిన భక్తులందరికీ దూరం నుంచే దర్శించుకొనేలా ఏర్పాటు చేశారు. భక్తులను ఎవర్నీ లోనికి అనుమతించచోమని కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు.

Samayam Telugu 22 Aug 2020, 8:58 pm
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఎదురైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న వేళ ఖైరతాబాద్ గణేశుణ్ని దర్శించుకొనేందుకు పోలీసులు అనుమతించలేదు. వారి ఆదేశాలను అనుసరించి మండపంలోకి భక్తులను కమిటీ సభ్యులు అనుమతించకుండా చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ దూరం నుంచే దర్శించుకొనేలా ఏర్పాటు చేశారు. భక్తులను ఎవర్నీ లోనికి అనుమతించచోమని కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. రోడ్డుమీది నుంచే అంతా దర్శనం చేసుకోవాలని ప్రకటించారు.
Samayam Telugu ఖైరతాబాద్ వినాయకుడు
khairatabad ganesh mandali


Also Read: undefined

ఈ క్రమంలోనే కమిటీ సభ్యుల నిర్ణయాన్ని భజరంగ్ దళ్ సభ్యులు వ్యతిరేకించారు. అక్కడే ఆందోళన చేపట్టారు. గణేష్‌కు అడ్డంగా పరదాల వంటివి కట్టొద్దని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే నిరసన కారులకు పోలీసులకు మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది.

Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి యువకుడు దిమ్మతిరిగే పంచ్.. అంతా ఆ ఫ్లెక్సీ మాయ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.