హైదరాబాద్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. దానికి సంబంధించి సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీడియో బయటకు రావడంతో ఆ రోడ్డు ప్రమాద తీవ్రత ఒళ్లు గగుర్పొడుస్తోంది. హైదరాబాద్లోని విద్యానగర్-నల్లకుంట రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై అధిక వేగంతో వెళ్తున్న యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. వివరాలివీ..
సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్(23) అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అతను విద్యానగర్ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్పై దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి అధిక వేగంతో డివైడర్ను ఢీకొన్నాడు. అక్కడే విద్యుత్ స్తంభం ఉండడంతో దానికి తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ కొన్ని మీటర్ల దూరం నిప్పు రవ్వలతో దూసుకెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్(23) అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అతను విద్యానగర్ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్పై దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి అధిక వేగంతో డివైడర్ను ఢీకొన్నాడు. అక్కడే విద్యుత్ స్తంభం ఉండడంతో దానికి తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ కొన్ని మీటర్ల దూరం నిప్పు రవ్వలతో దూసుకెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.