యాప్నగరం

Dalit Bandhu పథకంలో కీలక మార్పులు.. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు..!

Dalit Bandhu: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ప్రజల మెప్పు పొందాలంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ ఇప్పటినుంచే వ్యూహలు రచిస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకంలో కీలక మార్పులు చేసే ఆలోచనలో ఉంది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 30 Nov 2022, 7:11 am
Dalit Bandhu: తెలంగాణ ప్రభుత్వం దళితబంధు ప్రథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నద్దమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. లబ్ధిదారుల గుర్తింపు, వారికి ఆర్ధిక సహాయం చేసే చర్యలను షురూ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తాజాగా దళితబంధు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Dalit Bandhu
దళితబంధు


అత్యంత పేదలను ముందుగా గుర్తించి దళితబంధు లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల్లోని గ్రామాలన్నీ కవర్ అయ్యేలా లబ్ధిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల సిఫార్సుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాన్ని సిద్దం చేసి దళిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తోన్నారు. కానీ ఈ ప్రక్రియపై ఎప్పటినుంచో ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమ అనుచరులు, తమకు తెలిసిన వారిని మాత్రమే లబ్ధిదారుల జాబితాలో చేర్చుతున్నారని, దీని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు పెత్త ఎత్తున వినిపిస్తోన్నాయి.

దళితబంధు లబ్ధిదారుల జాబితాను సిద్దం చేసే అవకాశాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఇవ్వడంపై హైకోర్టులో కూడా చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, నగుదులో కొంత మొత్తం కమీషన్లుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాలు, దళిత సంఘాల నుంచి ఎప్పటినుంచో వినిపిస్తోన్నాయి. దీంతో అసలైన పేదలకు అన్యాయం జరుగుతుందని భావిస్తోన్న ప్రభుత్వం.. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని చూస్తోంది.

దళితబంధు లబ్దిదారుల ఎంపిక కోసం నియోజకవర్గాల వారీగా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆర్డీఓ లేదా జిల్లా అధికారి ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కమిటీల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూడా సభ్యుడిగా నియమించనుంది. ఈ మార్పులపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సూచించింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. కమిటీల ద్వారానే లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మొగ్గు చూపుతోన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త మార్పులకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.