యాప్నగరం

కరోనా రోగి ఇంట్లో భారీ చోరీ.. ఆస్పత్రి నుంచి వచ్చేసరికి మొత్తం స్వాహా..

Hyderabad Coronavirus: దాదాపు 20 రోజుల తర్వాత ఇంటికి రావడంతో తలుపులు తెరిచి ఉండడం చూసి బాధితులు ఆశ్చర్యపోయారు. లోనికి వెళ్లి పరిశీలిస్తే.. సామాన్లు, పది తులాల బంగారం, 30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.

Samayam Telugu 4 Jun 2020, 5:23 pm
హైదరాబాద్‌లోని కరోనా బాధితుడి ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. మే 11న అల్వాల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే వ్యక్తికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వెంటనే ఉద్యోగిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో భార్య, ఇద్దరు పిల్లలను క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. దాదాపు 21 రోజుల తర్వాత ఆ కుటుంబం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చింది. తీరా చూస్తే అప్పటికే చోరీ జరిగి ఉంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ చోరీ జరగ్గా బాధితులు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లుగా గుర్తించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Theft


ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి రావడంతో తలుపులు తెరిచి ఉండడం చూసి బాధితులు ఆశ్చర్యపోయారు. లోనికి వెళ్లి మొత్తం పరిశీలించగా.. కొన్ని సామాన్లు, పది తులాల బంగారం, 30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.