యాప్నగరం

దొంగతనానికి వచ్చి పారిపోతూ.. బావిలో పడి దుర్మరణం

ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి వచ్చారు. గ్రామస్థులు తరమడంతో పారిపోయే క్రమంలో ఓ దొంగ బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.

Samayam Telugu 13 Jul 2020, 5:06 pm
రాత్రిపూట దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని గ్రామస్థులు తరమడంతో బావిలోపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్‌పూర్ మండలం రాఘవపురం గ్రామంలో ముగ్గురు వ్యక్తులు శనివారం రాత్రి దొంగతనానికి వచ్చారు. గతంలోనూ ఇళ్లలో సెట్‌టాప్ బాక్సులు, ఫోన్లు చోరీకి గురవడంతో అప్రమత్తంగా ఉన్న గ్రామస్థులు.. ఈసారి వారిని పట్టుకోవాలని ప్రయత్నించారు.
Samayam Telugu నమూనా చిత్రం


ఈ క్రమంలో ఒకర్ని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దొరికిన వ్యక్తిని ఫరీజ్‌ఖాన్‌గా గుర్తించిన పోలీసులు.. అతడిపై హైదరాబాద్ పరిధిలో కేసులు ఉండటంతో.. హైదరాబాద్ పోలీసులకు సమచారం అందించి బైండోవర్ చేశారు.

పరారైన ఇద్దరిలో ఓ వ్యక్తి చీకట్లో పరిగెత్తుతూ బావిలో పడి చనిపోయాడు. ఆదివారం ఉదయం బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బావి పక్కన ఉన్న సెట్ టాప్ బాక్సులను బట్టి రాత్రి దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఇతడొకడని గుర్తించారు. కరోనా భయంతో స్థానికులెవరూ మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తేవడానికి ముందుకు రాకపోవడంతో.. కానిస్టేబుల్ కుమారస్వామి క్రేన్ సాయంతో దిగి డెడ్ బాడీని బయటకు తీశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.