యాప్నగరం

మెదక్: చోరీకి షాపులోకి వెళ్లిన దొంగ.. సజీవ దహనమై బయటికి..

Medak: వెంటనే కంగారు పడ్డ యజమాని స్థానికులకు సమాచారం అందించాడు. పోలీసులకు ఫోన్ చేయగా.. వారు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కిరాణా షాపులో దొంగ అగ్గిపుల్ల వెలిగించడం వల్ల చెలరేగిన మంటలకు దుకాణంలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.

Samayam Telugu 12 Sep 2020, 9:40 pm
దొంగతనం కోసం ఓ కిరాణషాపులోకి చొరబడ్డ సజీవ దహనమై బయటకు వచ్చాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. చోరీకి వెళ్లిన దొంగ షాపులో చీకటిగా ఉండడంతో అగ్గిపుల్ల వెలిగించాడు. అయితే, అక్కడే పెట్రోల్‌, శానిటైజర్‌ బాటిల్స్‌ ఉన్న విషయాన్ని అతను గమనించలేదు. అగ్గిపుల్ల వెలిగించగానే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో షాపులోనే దొంగ అగ్నికి ఆహుతై చనిపోయాడు. మెదక్ జిల్లా టేక్మాల్‌ మండలం పాల్వంచలో ఈ దుర్ఘటన జరిగింది. యజమాని ఉదయం ఎప్పటిలాగే దుకాణం తెరవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
fire


వెంటనే కంగారు పడ్డ యజమాని స్థానికులకు సమాచారం అందించాడు. పోలీసులకు ఫోన్ చేయగా.. వారు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కిరాణా షాపులో దొంగ అగ్గిపుల్ల వెలిగించడం వల్ల చెలరేగిన మంటలకు దుకాణంలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. నిత్యావసరాలు, ఫర్నిచర్, ప్లాస్టిక్ సీసాలు, పొట్లాలు తదితర సామగ్రి అగ్నికి ఆహుతైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.