యాప్నగరం

ఆ కరోనా రోగులకు చికిత్స చేయాల్సిన పన్లేదు.. కేసీఆర్ స్పష్టం

Coronavirus Treatment: వ్యాధి లక్షణాలు లేని కరోనా బాధితులకు చికిత్స అవసరం ఉండబోదని సీఎం కేసీఆర్ చెప్పారు. వైరస్ సోకిన వారిలో ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంటే మాత్రమే వైద్యం అందించాల్సి ఉంటుందని చెప్పారు.

Samayam Telugu 28 May 2020, 8:33 am
కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయానికి గురి కావాల్సిన అవసరం ఏం లేదని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఏం లేదని.. అందుకే సడలింపులు ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అయితే, ప్రజలు మాత్రం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కొన్ని అంచనాలు, విశ్లేషణల మేరకు రాబోయే మూడు నెలల్లో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా పెరుగతాయని.. అయినా అందుకు తగ్గ రీతిలో వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కేసుల పెరుగుదల, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాష్ట్ర స్థాయి కమిటీ ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రస్తుత పరిస్థితిని వివరించింది.
Samayam Telugu కేసీఆర్
kcr


వ్యాధి లక్షణాలు లేని కరోనా బాధితులకు చికిత్స అవసరం ఉండబోదని సీఎం కేసీఆర్ చెప్పారు. వైరస్ సోకిన వారిలో ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంటే మాత్రమే వైద్యం అందించాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి ఎలాంటి వైద్యం అవసరం కూడా అవసరం ఉండదు. మరో 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ (Influenza like illness) లక్షణాలు కనిపిస్తాయి. వీరు త్వరగానే కోలుకుంటారు.’’

Must Read: undefined

‘‘మిగతా 5 శాతం మందిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండేలా సారి (SARI-Severe Acute Respiratory Illness) లక్షణాలు వస్తుంటాయి. వీరి విషయంలోనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.మరణించే వారు కూడా ఇందులో నుంచే ఉంటారు. ఇతర సీరియస్ జబ్బులు కూడా ఉంటే మరణించే రేటు అధికంగా ఉంటుంది.’’ అని కమిటీ సభ్యులు వివరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.