యాప్నగరం

అలీసాగర్‌లో ముగ్గురు యువతుల మృత దేహాలు.. గజఈతగాళ్ల ద్వారా బయటకు..

Bodhan: సెల్ఫీ దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు అలీసాగర్ పార్కు సిబ్బంది ద్వారా తెలుస్తోంది.

Samayam Telugu 15 Nov 2020, 8:26 pm
నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌ ఉద్యానవనంలో విషాదం చోటుచేసుకుంది. అలీసాగర్ సరస్సులో ముగ్గురు యువతుల శవాలను గుర్తించారు. అలీసాగర్‌లో లభ్యమైన వారిని జుబెరా (16), మశేరా (14), మీరాజ్‌ (12)గా గుర్తించారు. ఈ యువతులు ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. సెల్ఫీ దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు అలీసాగర్ పార్కు సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఈ ముగ్గురు యువతులు బోధన్ పట్టణం రాకాసిపేట్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu బయటకు తీసిన మృతదేహాలు
ali sagar death


బోధన్‌లోని ఓ వార్డు కౌన్సిలర్‌కు వీరు అన్నయ్య కుమార్తెలని తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా 16 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అలీసాగర్ జలాశయం వద్దకు సరదాగా గడిపేందుకు వచ్చి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో జారిపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నీటిలో వీరిని గుర్తించడంతో వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి యువతుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహా లను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: కెనడాలో Hyd యువకుడు ఆత్మహత్య.. నైట్రోజన్ గ్యాస్ పీల్చి సూసైడ్

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.