యాప్నగరం

నిజామాబాద్‌లో విషాదం.. గోడ కూలి నిద్రలోనే ముగ్గురి మృతి

నిజామాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తోన్న వారిని గోడ రూపంలో మృత్యువు కబళించింది. గోడ కూలడంతో ముగ్గురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 22 May 2020, 10:03 am
ఇంటి గోడ కూలడంతో గాఢ నిద్రలో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వర్ని మండలం తంగేలేపల్లికి చెందిన శ్రీనివాస్ (35), లక్ష్మీ (30) దంపతులు తమ కుమారుడు సాయి (ఏడాదిన్నర వయసు), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి వరండాలో నిద్రిస్తుండగా.. గోడ కూలింది. దీంతో శ్రీనివాస్ దంపతులు, వారి కుమారుడు సాయి ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu నమూనా చిత్రం


ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో తంగేలేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.