యాప్నగరం

Road Accident: సీఎం కేసీఆర్ వెళ్లిన కాసేపటికే ఘోర ప్రమాదం.. గాల్లో కలిసిన ముగ్గురి ప్రాణాలు

Road Accident: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లిన రోడ్డుపైనే.. అది కూడా ఆయన కాన్వాయ్ వెళ్లిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ డీసీఎం.. ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు. సీఎం కేసీఆర్ వెళ్లిన అరగంట వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగటం గమనార్హం.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 4 Dec 2022, 4:40 pm

ప్రధానాంశాలు:

  • రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ముగ్గురు
  • సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిన కాసేపటికే ప్రమాదం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Acci
Road Accident: సీఎం కేసీఆర్... మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే.. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి వెళ్లిన రోడ్డు మార్గంలో.. ఆయన వెళ్లిన కాసేపటికే ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లటం వల్ల అప్పటి వరకు ట్రాఫి‌క్‌ను పోలీసులు ఆపేశారు. అయితే.. ముఖ్యమంత్రి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సామాన్య ప్రజలను కూడా రాకపోకలను అనుమతించారు. రోడ్డంతా ట్రాఫిక్‌మయంగా మారింది. ఈ క్రమంలోనే.. ఓ గర్తు తెలియని డీసీఎం అతివేగంగా దూసుకెళ్లింది. అదుపుతప్పి ముందువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
డీసీఎం చాలా వేగంగా వచ్చి వెనక నుంచి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో.. దానిపైన ఉన్న ముగ్గురు కింద పడగా.. వారిని డీసీఎం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో.. తీవ్ర గాయాలైన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా.. మృతులు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన గోపాల్ నాయక్(47), అంజలి( 42), స్వాతి(9)గా గుర్తించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిన అరగంటలోనే జరగటం గమనార్హం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.