యాప్నగరం

Hyderabad to Adilabad: కరోనా ఉందని తెలిసీ ఆర్టీసీ ప్రయాణం.. వారందరికీ అధికారుల రిక్వెస్ట్..

కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిసి కూడా ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Samayam Telugu 4 Jul 2020, 11:29 pm
తెలంగాణ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జనం భయంతో వణికిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు మాత్రం తమకు కరోనా సోకిందని తెలిసి కూడా ఆర్టీసీ బస్సెక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌కు ఈ ముగ్గురూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ఆదిలాబాద్‌కు పయనమయ్యారు.
Samayam Telugu తెలంగాణ ఆర్టీసీ


తెలంగాణ ఆర్టీసీకి చేందిన సూపర్‌ లగ్జరీ బస్సు (TS08Z 0229)లో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు బస్సు ఆదిలాబాద్‌ చేరుకుంది. దీంతో వారు బస్సు దిగి నేరుగా ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. తమకు కరోనా సోకిందని చెప్పి ఆస్పత్రిలో చేర్చుకోవాలని వైద్యులను కోరారు.

కరోనా లక్షణాలతో ఇటీవల నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాధితులు.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది.. ఆ బస్సులో ప్రయాణించిన వారు వెంటనే కరోనా పరీక్షలకు రావాలని కోరుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.