యాప్నగరం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి

నారాయణ పేట జిల్లాకు చెందిన కుటుంబం టెక్సాస్‌లో స్థిరపడింది. నాలుగునెలల క్రితం వారి తల్లిదండ్రులు ఇండియా నుంచి కొడుకు కూతురు వద్దకు వెళ్లారు.

Samayam Telugu 29 Nov 2020, 12:08 pm
తెలంగాణలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్ లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగు నెలల క్రితం భార్యా భర్తలిద్దరు కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు.
Samayam Telugu అమెరికా రోడ్డు ప్రమాదం
us road accident


Read More:
వేడెక్కిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. ఇవాల్టితో ముగింపు

శనివారం బందువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా నర్సింహా రెడ్డి ఆర్టీసి కాండక్టర్ గా హైదిరాబాద్ డిపో -1 లో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా వచ్చే నెల రిటైర్డ్మెంట్ పొందాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.