యాప్నగరం

అమ్మాయిలకు వేధింపులు.. ముగ్గురి అరెస్టు

Hyderabad నగరంలో అమ్మాయిలు, మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Samayam Telugu 26 Dec 2019, 12:09 am
మ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. షాపింగ్ మాల్స్, బస్టాపులు వేదికగా చేసుకొని నిందితులు ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముషీరాబాద్‌లోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సూరి ఈశ్వర్ (21) ప్రైవేటు ఉద్యోగి. కూకట్‌పల్లికి చెందిన శ్రీపతి మహేశ్వర్ రెడ్డి(27) సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ పీర్జాదిగూడ బుద్ధ నగర్ కాలనీకి చెందిన భూపతి నరసింహ(29)తో కలిసి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Samayam Telugu Medipally


పెట్రోలింగ్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించి ఈ ముగ్గురిని వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.

Also Read: ఘరానా దొంగ 400: ఇంటి అద్దె రూ.30 వేలు.. కళ్లు బైర్లు కమ్మే నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.