యాప్నగరం

హైదరాబాద్ వర్షం.. పిడుగులు పడే ప్రమాదం, బయటకు రావొద్దు

Hyderabad నగరంలో ఉరుములు, పిడుగులతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భాగ్యనగర వాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

Samayam Telugu 9 Oct 2019, 5:26 pm
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగరవాసులు సాధ్యమైనంత వరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu rain


బుధవారం (అక్టోబర్ 9) సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట, మాదాపూర్‌, కోఠి, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: సీఎం కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయమా? బెదిరింపా?

నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ చెప్పారు. విపత్తు నిర్వహణ, అత్యవసర బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఆయా బృందాలన్నీ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించారు.

వరద నీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్ తెరిచిపెట్టే ప్రయత్నం చేయవద్దని లోకేశ్ కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.