కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య (టీఐఎఫ్) రూ.1,22,42,419 లను విరాళంగా అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాక, వీఆర్ఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయరాణి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ పాఠశాల తరపున రూ.6 లక్షలను విరాళంగా అందించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ అనీల్ రూ.25 లక్షలు, డ్యూక్ బిస్కెట్స్ యాజమాన్యం రూ.25 లక్షలు అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్లో శుక్రవారం మంత్రి కేటీఆర్ను కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును స్వయంగా అందజేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వానికి ఆయన మరో రూ.50 లక్షలు ప్రకటించారు. సంక్షోభంలో చిక్కుకున్న సినీ పరిశ్రమలో కింది స్థాయి కార్మికులను ఆదుకొనేందుకు మరో రూ.25 లక్షలు ప్రకటించారు.
అంతేకాక, వీఆర్ఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయరాణి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ పాఠశాల తరపున రూ.6 లక్షలను విరాళంగా అందించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ అనీల్ రూ.25 లక్షలు, డ్యూక్ బిస్కెట్స్ యాజమాన్యం రూ.25 లక్షలు అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్లో శుక్రవారం మంత్రి కేటీఆర్ను కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును స్వయంగా అందజేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వానికి ఆయన మరో రూ.50 లక్షలు ప్రకటించారు. సంక్షోభంలో చిక్కుకున్న సినీ పరిశ్రమలో కింది స్థాయి కార్మికులను ఆదుకొనేందుకు మరో రూ.25 లక్షలు ప్రకటించారు.