యాప్నగరం

హైదరాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత.. భయాందోళనల్లో సిబ్బంది

అర్థరాత్రి రన్‌వేపై పులి సంచరించింది. దాదాపు పది నిమిషాల పాటు పులి సంచరిస్తున్నట్లు అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. ఆ తర్వాత గోడ దూకి రషీద్ గూడ వైపు వెళ్లిపోయినట్లు తెలిపారు.

Samayam Telugu 18 Jan 2021, 12:31 pm
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పులి సంచారం కలకలం రేపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పులిని చూశామంటూ రైతలు, స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి రన్‌వే సమీపంలో 10 నిమిషాల పాటు పులి సంచరించింది. అనంతరం గోడ దూకి రషీద్‌గూడ వైపు పరుగులు తీసింది. విమానాశ్రయం పరిసరాల్లో పులి సంచరిండంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Samayam Telugu ఎయిర్‌పోర్టులో పులి
tiger in shamshabad airport


Read More: కొడుకులే కాడెద్దులు.. అన్నదాతా నీ కష్టం చూడలేమయ్యా..

మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. మరోవైపు పులిని బంధించేందుకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధికారులకు చిక్కినట్టే చిక్కిన ఏ2 పులి తప్పించుకుని మహారాష్ట్రకు వెళ్లిపోయింది. దీంతో అధికారుల ఆపరేషన్ నిలిచిపోయింది. పులి తప్పించుకోవడంతో రెస్క్యూ టీమ్ , మహారాష్ట్ర నిపుణులు వెనుదిరిగారు. పులి మళ్లీ వస్తుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక సిబ్బందిచే యధావిధిగా నిఘా కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.