యాప్నగరం

తెలంగాణలో పులి సంచారం... పాదముద్రలు గుర్తించిన అధికారులు

ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో పులి సంచరించిన వార్తలు కలకలం రేపాయి. తాజాగా ఓరుగల్లు ఇలాఖాలో కూడా పులి పాద ముద్రల్ని అధికారులు గుర్తించారు.

Samayam Telugu 8 Nov 2020, 12:00 pm
తెలంగాణలో మరోసారి పులి సంచరిస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల పరిధి పాకాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు శనివారం అటవీ అధికారులు గుర్తించారు. పులి వెళ్లిన ప్రాంతంలో పాద ముద్రలను సేకరించి సంచరిస్తున్నట్లు నిర్ధారించుకు న్నారు. కొద్ది రోజులుగా మహబూబాబాద్ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో సంచరించిన పులి.. పాకాల అటవీ ప్రాంతానికి వచ్చినట్లు గుర్తించారు.
Samayam Telugu పులి సంచారం


Read More: అలా చేస్తే డబుల్ ఇళ్లు ఇచ్చేది మేమే... గ్రేటర్ ప్రజలకు కేంద్రమంత్రి రిక్వెస్ట్

ఖానాపురం మండలంలోని బండమీదిమామిడితండా శివారు అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపులులు అక్కడక్కడా జనావాసంలోనికి వచ్చి ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న మంచిర్యాల, కొమురంభీం జిల్లాలతో పాటు హైదరాబాదు నగర ప్రజలను భయెందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.