హైదరాబాద్ శివార్లలో చిరుత పులి సంచారం నగరవాసులను భయపెట్టగా.. ఆసిఫాబాద్ జిల్లా వాసులను పెద్దపులి భయపెడుతోంది. గత మూడు వారాలుగా తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఖైరిగూడలోని సింగరేణి కార్మికులకు తరచుగా పెద్దపులి కనిపిస్తుండటంతో వారు కలవరానికి గురవుతున్నారు. పది రోజుల క్రితం వాగులో నుంచి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిన పులి తాజాగా మట్టికుప్పల్లో కనిపించింది.
అటుగా వచ్చిన పశువుల మీదకు పెద్ద పులి దాడికి యత్నించగా.. అవి అరుస్తూ పరిగెత్తాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్న కార్మికులు వాహనంలో వెళ్తుండగా వారికి ఈ దృశ్యం కంటపడింది. పెద్దపులిని గమనించగానే.. వారు వాహనాన్ని నిలిపేసి.. తమ ఫోన్లో వీడియో చిత్రీకరించారు.
గతంలో ఆసిఫాబాద్, చిర్రకుంట, కుంపల్లి అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అటవీప్రాంతం నుంచి ఆడతోడు కోసం మగపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ ప్రాంతంలో రెండు పులులు ఉన్నట్లే. సింగరేణి గనుల వల్ల ప్రశాంతత దెబ్బతినడంతో పులులు ఇక్కడ నిర్ధిష్టమైన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి.
అటుగా వచ్చిన పశువుల మీదకు పెద్ద పులి దాడికి యత్నించగా.. అవి అరుస్తూ పరిగెత్తాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్న కార్మికులు వాహనంలో వెళ్తుండగా వారికి ఈ దృశ్యం కంటపడింది. పెద్దపులిని గమనించగానే.. వారు వాహనాన్ని నిలిపేసి.. తమ ఫోన్లో వీడియో చిత్రీకరించారు.
గతంలో ఆసిఫాబాద్, చిర్రకుంట, కుంపల్లి అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అటవీప్రాంతం నుంచి ఆడతోడు కోసం మగపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ ప్రాంతంలో రెండు పులులు ఉన్నట్లే. సింగరేణి గనుల వల్ల ప్రశాంతత దెబ్బతినడంతో పులులు ఇక్కడ నిర్ధిష్టమైన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి.