యాప్నగరం

దళారుల అడ్డాగా ప్రగతి భవన్.. అందుకే ఖర్చులు పెరుగుతున్నాయ్ : కోదండరాం

రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలు పెరుగుతుండడంపై ప్రొఫెసర్ కోదండరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో కమిషన్లు కట్టాల్సి రావడం వల్లే నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Samayam Telugu 23 Apr 2022, 8:56 pm
తెలంగాణ ముఖ్యమంత్రి అధికార సౌధం ప్రగతి భవన్ దళారులకు అడ్డాగా మారిందని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్‌లో తిష్టవేసిన దళారుడు కమీషన్లు దండుకుంటున్నారని.. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. కమిషన్లు తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నారని.. దీంతో నిజాయతీ కలిగిన కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని కోదండరాం అన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా నడుస్తున్న ఈ దందాను నిలువరించాలని.. లేకుంటే ముఖ్యమంత్రి కార్యాలయమే వాటిని ప్రోత్సహిస్తోందని భావించాల్సి ఉంటుందన్నారు.
Samayam Telugu kodandaram


విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెరుగుదలపై కోదండరాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈనెల 25, 26 తేదీల్లో అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేస్తామని.. కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందజేస్తామన్నారు. నిత్యవసర సరుకులు పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని.. పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్ర జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పారని.. నెలలు గడుస్తున్నా నేటికీ నోటిఫికేషన్లు వేయడం లేదన్నారు. అభ్యర్థులు వేల రూపాయలు ఖర్చు చేసుకుని కోచింగ్‌లు తీసుకుంటున్నారని.. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే నెల 4 నుంచి నల్గొండ జిల్లాలో కృష్ణ జలాల పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.