యాప్నగరం

ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదు: కోదండరాం

Shadnagar Encounter ఘటనపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్లు సమస్యలకు పరిష్కారం కాదన్నారు. అత్యాచారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Samayam Telugu 7 Dec 2019, 11:31 pm
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఎన్‌కౌంటర్ల ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. అత్యాచారాలు, హత్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీజేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం మాట్లాడారు. దిశా తరహా ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Samayam Telugu కోదండరాం


వరంగల్‌లో అత్యాచారం, హత్యకు గురైన యువతి ఘటనపై ఈ రౌండ్ టేబుల్‌‌లో సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Also Read: అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి.. పోలీసుల పరిస్థితి ఏంటి?

ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోదండరామ్ కోరారు. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటన తర్వాత మానవ హక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామికవాదులు, విపక్షాల నేతలు పోలీసుల తీరుపై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. శిక్షలు విధించే అధికారం ఖాకీ చేతికి ఇవ్వవద్దని.. న్యాయ విచారణ తర్వాతే శిక్షలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.