యాప్నగరం

సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాల వెల్లువ.. ఉద్యోగుల ఒక్క రోజు వేతనం

Coronavirus కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడానికి పలువురు ముందుకొస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు బూరీ విరాళాలు అందిస్తున్నారు.

Samayam Telugu 24 Mar 2020, 6:31 pm
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా 12 కిలోల బియ్యం, రూ.1500 చొప్పున పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అండగా నిలవడానికి పలువురు ముందుకొస్తున్నారు. కష్ట కాలంలో తమ ఉదారత చాటుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేస్తున్నారు.
Samayam Telugu kcr


పేదలకు అండగా నిలవడం కోసం ఒక్క రోజు వేతనాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు టీఎన్జీవో, టీజీవో ఉద్యోగులు. మంగళవారం (మార్చి 24) టీఎన్జీవో-టీజీవో జేఏసీ సభ్యులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, పేదలకు ఆహార ధాన్యాల సరఫరా కోసం ఒక రోజు జీతాలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉద్యోగ సంఘాలు వదులుకోనున్న ఒక రోజు జీతాల మొత్తం సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని జేఏసీ నేతలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీజీవో అధ్యక్షుడు రవీందర్ గౌడ్, సెక్రటరీ జనరల్ మమత.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రూ. 48 కోట్ల చెక్కును అందజేశారు. ఉద్యోగుల ఉదారతకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపినట్లు సమాచారం.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ సీఎం రిలీఫ్ ఫండ్‌కు బూరీ విరాళం ప్రకటించారు. అనుపమ తండ్రి సీఎం కేసీఆర్‌కు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటికే హీరో నితిన్ రూ.10 లక్షల విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. అటు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

Also Read: లాక్‌డౌన్ సాకుతో రేట్లు పెంచితే అంతే.. తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.