యాప్నగరం

TRS: ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం.. కానీ ఇక్కడ ఘోరంగా గల్లంతు!

Municipal Election Results: మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీలు పోటాపోటీగా తమ అభ్యర్థులను దూర ప్రాంతాల్లోని క్యాంపులకు తరలించాయి. బీజేపీ-ఎంఐఎం మధ్యనే పోటీ నెలకొనడంతో అభ్యర్థులను రక్షించుకునేందుకు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు.

Samayam Telugu 25 Jan 2020, 1:14 pm
భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం జెండా పాతింది. భైంసాలో మొత్తం 26 వార్డులు ఉండగా, ఎంఐఎం అత్యధికంగా 15, బీజేపీ 9, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎంఐఎం-బీజేపీ మధ్యనే ఎక్కువ పోటీ కనిపించింది. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆచూకీ అసలు కనిపించలేదు. తొలి నుంచి ఎంఐఎం-బీజేపీ మధ్యనే హోరాహోరీ పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆచూకీ గల్లంతు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu Bhainsa Municipality
Bhainsa Muncipality/Facebook


Also Read: టీఆర్ఎస్-కాంగ్రెస్ హోరాహోరీ.. అక్కడ అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్!

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను ఇక్కడ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చేదు అనుభవమే ఎదురైంది. పోలింగ్ వరకు ఇరు పార్టీలు ఊహించి, అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా తాజాగా ఫలితాలు వస్తున్నాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక కోసం ఇరు పార్టీలు ఎత్తులు వేశాయి. వార్డు కౌన్సిలర్ పదవులకు పోటీచేసిన అభ్యర్థులను తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేశారు.

Also Read: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లైవ్: దూసుకుపోతున్న కారు.. అక్కడ మాత్రం గట్టి పోటీ

మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీలు పోటాపోటీగా తమ అభ్యర్థులను దూర ప్రాంతాల్లోని క్యాంపులకు తరలించాయి. బీజేపీ-ఎంఐఎం మధ్యనే పోటీ నెలకొనడంతో అభ్యర్థులను రక్షించుకునేందుకు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మెజారిటీ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా స్వతంత్రులతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులతో బేరసారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేతలు ముందస్తుగానే క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో పోటీచేసిన పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు.

Also Read: తెలంగాణలో ఆ పని మూడేళ్ల కిందటే ప్రారంభించాం: కేటీఆర్

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 12 రాత్రి జరిగిన ఓ ఘటన రెండు మతాల వారు కొట్టుకొనేలా చేసింది. ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తుండగా, కొర్బా గల్లీలో స్థానిక యువకులు అతడిని ఆపి మెల్లగా వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ యువకుడు తన వర్గానికి చెందిన వారిని వెంట తీసుకొని వచ్చి స్థానికంగా విధ్వంసం సృష్టించినట్లు సమాచారం. దీంతో పట్టణంలో ఆ ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Also Read: ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతిలో ఎన్నిక: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కీలక ప్రెస్ మీట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.