తెలంగాణ కాంగ్రెస్లో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న ఆ ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడడం ఆసక్తికరంగా మారింది. ఒకరిపై మరొకరు పరోక్ష విమర్శలు చేసుకుంటూ పార్టీలో హీట్ రాజేసిన నేతలు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకోవడం.. ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి. ఇద్దరు నేతలు అసెంబ్లీలో ఎదురుపడ్డారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పలకరించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఇద్దరూ కరచాలనం చేసుకుంటూ మీడియా ప్రతినిధులకు ఫోజులిచ్చారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని చర్చించుకున్నారు. అనూహ్య పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఉప్పూనిప్పులా ఉంటోన్న నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ప్రత్యేకంగా సమావేశం కావడం విశేషం.
టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టిన నాటి నుంచి సీనియర్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పలు అంశాలపై రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఒంటెత్తు పోకడలు పోతున్నారని.. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడేవారు. ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.
ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. తనపై కోవర్టు అని ముద్ర వేసి తన క్యారెక్టర్ను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానంటూ ఏకంగా సోనియా, రాహుల్కి లేఖలు రాశారు. అయితే పార్టీలో సీనియర్ నేతల సూచనల మేరకు కాస్త వెనక్కి తగ్గిన జగ్గా రెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇలాంటి హాట్హాట్ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి, జగ్గా రెడ్డి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read:
టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టిన నాటి నుంచి సీనియర్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పలు అంశాలపై రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఒంటెత్తు పోకడలు పోతున్నారని.. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడేవారు. ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.
ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. తనపై కోవర్టు అని ముద్ర వేసి తన క్యారెక్టర్ను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానంటూ ఏకంగా సోనియా, రాహుల్కి లేఖలు రాశారు. అయితే పార్టీలో సీనియర్ నేతల సూచనల మేరకు కాస్త వెనక్కి తగ్గిన జగ్గా రెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇలాంటి హాట్హాట్ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి, జగ్గా రెడ్డి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: