హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్ను పేల్చేయాలంటూ వ్యాఖ్యానించారు. నక్సలైట్లు ప్రగతిభవన్ పెల్చేసినా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. పేదలకు కేసీఆర్ ఇళ్లు ఇవ్వలేదు గానీ.. హైదరాబాద్ నడిబొడ్డున పది ఏకరాలల్లో 2000 కోట్లతో 150 గదుల ప్రగతి భవన్ నిర్మించుకున్నారని విమర్శించారు. ప్రగతిభవన్లో ఏపీ పెట్టుబడుదారులకు ఎర్రతీవాచీతో స్వాగతిస్తున్నారని.. పేదకు మాత్రం ప్రవేశం లేదన్నారు. అలాంటి ప్రగతిభవన్ ఎందుకంటూ దుయ్యబట్టారు. ఆనాడు గడీలను గ్రానేట్లతో పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్ను పేల్చేయాలంటూ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుంది తప్పా.. పేదోడీకీ న్యాయం అక్కడ జరగదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు.. మంత్రి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ మొత్తం మా కుటుంబమే అంటున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు. ఉద్యమ సమయంలో చదువుకుంది గుంటూరులో, చిప్పలు కడిగింది అమెరికాలో. ఉద్యమకారులను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? ఉద్యమ ద్రోహులంతా పదువులలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఒక్కరోజైనా బుక్కడు బువ్వ పెట్టావా?" అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు.. మంత్రి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ మొత్తం మా కుటుంబమే అంటున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు. ఉద్యమ సమయంలో చదువుకుంది గుంటూరులో, చిప్పలు కడిగింది అమెరికాలో. ఉద్యమకారులను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? ఉద్యమ ద్రోహులంతా పదువులలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఒక్కరోజైనా బుక్కడు బువ్వ పెట్టావా?" అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
- Read More Telangana News And Telugu News