యాప్నగరం

'ఇక్కడ జానారెడ్డి ఎలానో.. అక్కడ మాణిక్ రావు ఠాక్రే అలా.. అందుకే..' రేవంత్ ఇంట్రెస్టింగ్ పోలిక

తెలంగాణ కాంగ్రెస్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే మాణిక్ రావు ఠాక్రే సమావేశాలు నిర్వహిచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్త ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మాణిక్ రావు ఠాక్రే.. పార్టీ నేతలతో వరుసగా రెండు రోజుల పాటు సమావేశమయ్యారన్నారు. తెలంగాణలో పెద్దలు జానారెడ్డి అంతటి అనుభవమున్న నేత ఠాక్రే అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనారెడ్డి ఎలాగో.. మహారాష్ట్రలో మాణిక్ రావు ఠాక్రే అలాగే సమర్థవంతంగా పని చేశారని వివరించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 12 Jan 2023, 6:24 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమావేశాలపై రేవంత్ స్పందన
  • ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే ఠాక్రే సమావేశాలని స్పష్టం
  • ఇక్కడ జానారెడ్డి ఎలాగో అక్కడ ఠాక్రే అలా అంటూ పోలిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu revanth-reddy
రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమావేశాలు నిర్వహిచారని తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇది ఎన్నికల సంవత్సరమని, అందుకే కొత్త ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ఠాక్రే.. పార్టీ నేతలతో వరుసగా రెండు రోజుల పాటు సమావేశమయ్యారన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ, సీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారని ఆయన తెలిపారు. ఇటు పార్టీలో, అటు రాజకీయంగా ఠాక్రేకు సుదీర్ఘ అనుభవం ఉందని రేవంత్ తెలిపారు. యూత్ కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు అనేక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉందన్నారు. ముంబైలో బాంబు బ్లాస్ట్, మతకల్లోలాలు జరిగిన సమయంలో ఆయన హోంమంత్రిగా ఉన్నారని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారని గుర్తు చేశారు రేవంత్.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డి ఎంత సమర్థవంతంగా పనిచేశారో... మహారాష్ట్రలో శరత్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఠాక్రే కూడా అంతే సమర్థవంతంగా పనిచేశారని రేవంత్ కొనియాడారు. తెలంగాణలో పెద్దలు జానారెడ్డి అంతటి అనుభవమున్న నేత ఠాక్రే అని చెప్పారు రేవంత్. సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు గుర్తింపు ఉందని... అలాంటి నేత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు. అంతటి అనుభవం, గుర్తింపు ఉన్న నేతను ఇంఛార్జ్‌గా నియమించిందంటే అధిష్ఠానంకు తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఠాక్రే రెండు రోజుల పర్యటనలో జనవరి 26 నుంచి జరిగే హాత్ సే హాత్ జోడో యాత్రపై పార్టీలో అందరితో మాట్లాడారని రేవంత్ తెలిపారు. సంక్రాంతి తరువాత క్షేత్ర స్థాయిలో పర్యటించి యాత్రకు సంబంధించి మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నేతలకు సూచించినట్లు ఆయన తెలిపారు. సమన్వయంతో జనవరి 20 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఠాక్రే తెలిపారని.. 21న మరోసారి పర్యటించి పూర్తి స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ఆయన ప్రకటిస్తారన్నారు రేవంత్.

పీవీ నరసింహారావు పీఎం అయ్యారంటే ఆయన దీవెనతోనే.. ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన కేసీఆర్..
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.