యాప్నగరం

PV Birth Anniversary: భారత్ ఆర్థికంగా శక్తిమంతంగా నిలవడానికి ఆయనే కారణం: రేవంత్

భారత్ ఆర్థికంగా శక్తిమంతంగా నిలవడానికి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదిగారని.. ఆయన సేవలు మరవలేనివని అన్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 28 Jun 2022, 1:43 pm
ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఆర్థికంగా శక్తిమంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని చెప్పారు. మంగళవారం పీవీ జయంతి సందర్భంగా రేవంత్ మాట్లాడారు. పీవీ మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదిగారని.. ఆయన సేవలు మరవలేనివని అన్నారు.
Samayam Telugu Revanth Reddy


భూ సంస్కరణలు తెచ్చి.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారని రేవంత్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమని చెప్పుకొచ్చారు. దివంగత జైపాల్ రెడ్డి కూడా పీవీ అడుగుల్లో నడిచారని చెప్పారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతోందన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్థం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని అన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.