భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారశైలి ఉందని రేవంత్ ధ్వజమెత్తారు. మరో ఏడాదిలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతం అయ్యారని విమర్శించారు.
తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు తెలంగాణలో కాలం చెల్లిందని కేసీఆర్ గ్రహించారని.. ఇకపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్తో రుణం తీరిపోయిందని అన్నారు. అందువల్లనే తెలంగాణ అనే పదం కనిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ మండిపడ్డారు.
తెలంగాణ హంతకుడ్ని వదిలే ప్రస్తక్తే లేదని, ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని, రాష్ట్రంలో ఇకపై పోటీ చేయడానికి కూడా కేసీఆర్కు అర్హత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయం ఆలోచించాలన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు.
తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు తెలంగాణలో కాలం చెల్లిందని కేసీఆర్ గ్రహించారని.. ఇకపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్తో రుణం తీరిపోయిందని అన్నారు. అందువల్లనే తెలంగాణ అనే పదం కనిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ మండిపడ్డారు.
తెలంగాణ హంతకుడ్ని వదిలే ప్రస్తక్తే లేదని, ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని, రాష్ట్రంలో ఇకపై పోటీ చేయడానికి కూడా కేసీఆర్కు అర్హత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయం ఆలోచించాలన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు.