ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్లో రైతులను బీజేపీ నేతలు రాక్షసంగా పొట్టనబెట్టుకున్నారని, దీనిపై ప్రధాని మోదీ, అమిత్ షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, దేశంలోని 80 శాతం మంది రైతుల సమస్య అని అన్నారు. దేశంలోని 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు తీసుకొచ్చారని, అందుకే అన్నదాతలు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను తొలుత వ్యతిరేకించినట్లు చెప్పిన ముఖ్యమంత్రి.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్కు చలిజ్వరం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించి చంపేశాడు... ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోదీకి కనిపించడం లేదా అని రేవంత్ నిలదీశారు.
ప్రధాని మనసులో మాట కాదు.. దేశ ప్రజల మనసులో మాట వినాలని మోదీకి హితవుపలికారు. సిరిసిల్లలోనూ దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని రేవంత్ ఆరోపించారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోదీకి లొంగిపోయారని విమర్శించారు. మోదీ, కేసీఆర్లను బొందపెడితేనే దేశం, రాష్ట్రంలో శాంతి నెలకుంటుందని అన్నారు. రైతుల హత్యలను మోదీ, అమిత్ షా ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని అన్నారు.
ప్రధాని మనసులో మాట కాదు.. దేశ ప్రజల మనసులో మాట వినాలని మోదీకి హితవుపలికారు. సిరిసిల్లలోనూ దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని రేవంత్ ఆరోపించారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోదీకి లొంగిపోయారని విమర్శించారు. మోదీ, కేసీఆర్లను బొందపెడితేనే దేశం, రాష్ట్రంలో శాంతి నెలకుంటుందని అన్నారు. రైతుల హత్యలను మోదీ, అమిత్ షా ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని అన్నారు.