యాప్నగరం

దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ స్పష్టత.. ప్రకటించిన ఉత్తమ్

Telangana Congress: ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంత్యక్రియలు ముగిసిన రోజే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నిక గురించి మాట్లాడారు. రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ నుంచి తాము పోటీకి రాబోమని చెప్పారు.

Samayam Telugu 14 Aug 2020, 4:04 pm
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అనారోగ్యం కారణంగా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు మాసాల్లోగా అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar reddy


అయితే, ఇక్కడ ఎన్నికలు అవసరం లేకుండా ఏకగ్రీవం అయ్యేందుకు టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ తన ఉద్దేశ్యాన్ని చెప్పడంతో దుబ్బాకలో టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంత్యక్రియలు ముగిసిన రోజే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నిక గురించి మాట్లాడారు. రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ నుంచి తాము పోటీకి రాబోమని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడితో తాను మాట్లాడతానని చెప్పారు. ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇవ్వడం సముచిత గౌరవమని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.