యాప్నగరం

అమానుషం.. అంత్యక్రియలకు సహకరించని గ్రామస్థులు.. కరోనా లేకున్నా దారుణం

కరోనా అనుమానం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. తమకు ఎక్కడ కరోనా సోకుతుందేమోననే అనుమానంతో అంత్యక్రియలకు కూడా సహకరించడం లేదు.

Samayam Telugu 10 Aug 2020, 3:06 pm
కరోనా భయం మనుషుల్లో మానవత్వం లేకుండా చేస్తోంది. కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఎవరైనా కరోనా లక్షణాలతో చనిపోతే.. అటువైపు వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. అంతే కాదు.. కరోనాతో చనిపోయాడేమోననే అనుమానంతో అంత్యక్రియలకు కూడా సహకరించడం లేదు. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu నమూనా చిత్రం
Representative image


పాల్వంచ సమీపంలోని నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గండెపోటుతో మరణించాడు. కానీ కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో గ్రామస్థులెవరూ అంత్యక్రియలకు సహకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గంటల తరబడి నరకయాతన అనుభవించారు. గ్రామకార్యదర్శి, సర్పంచ్ అంత్యక్రియలకు పంచాయతీ ట్రాక్టర్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న రంజిత్ అనే వ్యక్తి పొలంలో దమ్ము చేస్తున్న తన ట్రాక్టర్‌ను పంపించాడు. 5 కి.మీ. దూరం నుంచి ఆ ట్రాక్టర్‌ను తీసుకొచ్చి ముగ్గురి సహకారంతో ఆ మృతదేహాన్ని ఖననం చేశారు. ట్రాక్టర్‌ తమ వీధిలో నుంచి వెళ్లొద్దని గ్రామస్థులు గొడవ చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు లోనయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.