యాప్నగరం

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి కొత్త పార్టీ

మరో రెండు మూడు నెలల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అటు పార్టీలు కూడా ఇప్పటినుంచే ఎన్నికల బరిలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభించాయి.

Samayam Telugu 30 Sep 2020, 7:28 am
తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్‌ఎం సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావుడి మొదలయ్యింది. ఎన్నికల అధికారులు మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలాని భావిస్తున్నారు. అయితే ఇప్పట్నుంచే అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రతీసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పాటు మిత్రపక్షం ఎంఐఎం, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ చేస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి మరో పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది.
Samayam Telugu జీహెచ్ఎంసీ ఎన్నికలు
ghmc elections


Read More: సిరిసిల్లలో వ్యభిచార గృహం.. అద్దె ఇంట్లో గుట్టుగా దందా, పలువురు అరెస్టు

తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (టీఆర్‌ఎల్‌డీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 90 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎల్‌డీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.