యాప్నగరం

టీఆర్ఎస్ ఖాతాలోకే ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటు.. మళ్లీ పల్లా విజయం

Khammam: పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి గెలుపునకు 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దీంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు.

Samayam Telugu 20 Mar 2021, 11:53 pm
నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలిచారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోరులో రెండింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయింది. మరోవైపు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి జరిగిన పోరులో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి గెలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Samayam Telugu పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
palla rajeshwar reddy


ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో అభ్యర్థుల మధ్య పోటీ ఆది నుంచి ఉత్కంఠగా సాగింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి గెలుపునకు 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దీంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. ఈ స్థానం నుంచి మొత్తం 71 మంది బరిలో నిలిచారు.

ఈ స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లు ఉండగా, 3,87,969 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో 3,66,333 చెల్లినవి కాగా, 21,636 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,11,812 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 84,118 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరాంకు 71,126, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డికి 39,306, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,729 ఓట్లు వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.