యాప్నగరం

KCR National Party: దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. కీలక బాధ్యతలు వాళ్లకే..!

KCR National Party: గులాబీ దళపతి కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్సయ్యింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే విజయదశమి రోజే పార్టీపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజులుగా చర్చలు జరుపుతోన్న గులాబీ బాస్.. జాతీయ పార్టీ జెండా, అజెండాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 5 రోజున పార్టీ అధికారిక ప్రకటనతో పాటు పార్టీ కోఆర్డినేటర్లను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 29 Sep 2022, 12:28 pm
KCR National Party: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోన్న గులాబీ బాస్ కేసీఆర్ (K Chandrashekar Rao).. తన జాతీయ పార్టీ ఏర్పాటు కోసం చేస్తున్న సుదీర్ఘ కసరత్తు కొలిక్కి వచ్చింది. దసరా (Dussehra) రోజే జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్టోబరు 5న 11 గంటలకు టీఆర్ఎస్ (TRS) పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులంతా కలిసి.. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. అనంతరం 12 గంటలకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశలో కూడా జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. ఈ రెండు సమావేశాల అనంతరం.. గులాబీ దళపతి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారు. పార్టీ ఎలా ఉండబోతోంది.. జెండా, అజెండా, కార్యచరణ లాంటి అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో జాతీయ పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్ల (party co ordinators) ను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి కేసీఆర్‌తో కలిసి నడిచే జాతీయ నాయకులను సైతం ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
Samayam Telugu KCR dussera
కేసీఆర్ జాతీయ పార్టీ


జాతీయ స్థాయిలో తన మార్కు చూపించేందుకు సిద్ధమైన కేసీఆర్.. దేశ ప్రజల్లోకి జాతీయ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల పెద్దలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రాజకీయ నిపుణులతో సమాలోచనలు జరిపిన గులాబీ బాస్.. చాలా క్లారిటీగా ప్రణాళిక సిద్ధం చేసకున్నారు. అయితే.. ఇంత ప్రతిష్టాత్మకంగా దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్.. జాతీయ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఎవరెవరికి అప్పజెప్పనున్నారనే అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పటికి ముందు నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పలువురు కీలక నేతలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ నేతలు.. కేసీఆర్ వెంటే ఉంటూ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటున్నారు. అందులోనూ.. ఢిల్లీ స్థాయిలో పరపతి ఉండి.. ఇతర రాష్ట్రాల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేతలకే కేసీఆర్.. బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కూడా.. వారికే పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు.. పక్క రాష్ట్రాల్లోనూ ఎక్స్‌పోజర్ ఉన్న నేతలకు కేసీఆర్.. జాతీయ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించున్నారని శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. అనూహ్యమైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే గులాబీ దళపతి.. జాతీయ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.. ఎవరెవరికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించనున్నారన్న అంశాలపై క్లారిటీ రావాలంటే.. దసరా వరకు వేచిచూడాల్సిందే..‍!

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.