యాప్నగరం

ఎంపీ అర్వింద్‌ మెడకు బలమైన ఉచ్చు.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

Nizamabad MP: నిజామాబాద్ ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ త్వరలో హైకోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు క్రిశాంక్ తెలిపారు. ఏడాదిగా అరవింద్ దొంగ సర్టిఫికెట్‌తో ఎంపీగా చెలామణి అవుతున్నారని అంటున్నారు.

Samayam Telugu 24 May 2020, 3:13 pm
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లక్ష్యంగా టీఆర్ఎస్ మరోసారి ఫిర్యాదు చేసింది. ఆయన విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు నకిలీవని కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ధర్మపురి అరవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
Samayam Telugu ధర్మపురి అర్వింద్


ధర్మపురి అర్వింద్ తాను రాజస్థాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేసినట్లు గత లోక్‌సభ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో అర్వింద్ సమర్పించారని క్రిశాంక్ ఆరోపిస్తున్నారు. ‘‘ఎన్నికల సంఘాన్ని అర్వింద్ తప్పు దోవ పట్టిచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఏంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ, అరవింద్ దొంగ సర్టిఫికెట్ సృష్టించాడు. అసలు అరవింద్ రాజస్థాన్ రాష్ట్రంలో ఎలాంటి చదువు చదవలేదు. దొంగ సర్టిఫికెట్ రూపకల్పన వివాదంలో ఇరుక్కుని సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఒక సంస్థ నుంచి పీజీ సర్టిఫికెట్‌ను అరవింద్ కొనుగోలు చేశారు.’’ అని క్రిశాంక్ ఆరోపిస్తున్నారు.

Also Read: undefined

నిజామాబాద్ ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ త్వరలో హైకోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు క్రిశాంక్ తెలిపారు. ఏడాదిగా అరవింద్ దొంగ సర్టిఫికెట్‌తో ఎంపీగా చెలామణి అవుతున్నారని అంటున్నారు. మరోపక్క, మాజీ ఎంపీ కవిత మెప్పు కోసమే క్రిశాంత్ ఈ ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు వివరణ ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకూ పోతుందో చూడాల్సి ఉంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.