యాప్నగరం

ప్రణబ్‌ ముఖర్జీపై తొందరపడ్డ టీఆర్ఎస్ మాజీ ఎంపీ.. వెంటనే ట్వీట్ డిలీట్

Hyderabad: ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి శస్త్రచికిత్స చేశారు.

Samayam Telugu 13 Aug 2020, 8:23 pm
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన చనిపోయారని బుధవారం రాత్రి నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవి మీడియాలో సైతం రావడంతో స్వయంగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ స్పష్టత ఇచ్చారు. ఆయన ఆస్పత్రిలో చికిత్సకు స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (ఫైల్ ఫోటో)
Boora Narsaiah Goud


ఇక ప్రణబ్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి కొందరు అదే నిజమని భావిస్తున్నారు. ఇలాగే టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సైతం తొందరపడ్డారు. ప్రణబ్ ముఖర్జీ గురించి ఓ ట్వీట్ చేశారు. వెంటనే పొరపాటును గ్రహించిన ఆయన తన ట్వీట్‌ను తొలగించేశారు. ఈ ట్వీట్ దాదాపు అరగంటకు పైగా అంతే ఉంది. ఈలోపే కొంత మంది ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

Must Read: undefined

ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.