మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి పార్థీవ దేహానికి టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నివాళులు అర్పించారు. తోగుటలోని ముత్యం రెడ్డి నివాసానికి వెళ్లిన హరీశ్ రావు.. ఆయన పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. హరీశ్ రావుతోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెరుకు ముత్యం రెడ్డి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
గత ఏడాది తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ముత్యం రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 1989లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పని చేశారు. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
ముత్యం రెడ్డి 1989 నుంచి 1999 వరకు దొమ్మాట ఎమ్మెల్యేగా పని చేశారు. 1994లో టీడీపీలో సంక్షోభం తలెత్తడంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రివర్గంలో ముత్యంరెడ్డికి స్థానం దక్కింది. పౌరసరఫరాల మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ముత్యం రెడ్డి పనిచేశారు. ఆయన చివరి సారిగా 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
గత ఏడాది తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ముత్యం రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 1989లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పని చేశారు. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.