యాప్నగరం

అధికారం కొందరికే పరిమితం.. టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు

గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న మాజీ శాసనమండలి ఛైర్మన్ అయిన స్వామిగౌడ్ ఇలా ఒక్కసారిగా కుల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. అధిష్టానంపై ఆయన అసంతప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 20 Aug 2020, 3:40 pm
తెలంగాణలో నేతల రాజకీయ విమర్శలు రాజుకుంటున్నాయి. గవర్నర్ తమిళ సై- టిఆర్ఎస్ నేతలు కామెంట్ లు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మెన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయన్నారు. అధికారం కొంతమందికే పరిమితమైందన్నారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నాయని, కొన్ని కులాల వారు మాత్రమే పరిపాలన విభాగం లో ఉండి ప్రజలను పాలిస్తున్నారు అని, బడుగు బలహీన వర్గాల ప్రజలను ముందుకు తీసుకెళ్లాలని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu స్వామిగౌడ్
Swamy Goud

Read More: విద్యార్థులకు గుడ్ న్యూస్... ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్ నెట్
కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు బాలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శ్రీ నారాయణగురు జయంతి వేడుకల్లో స్వామి గౌడ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ నారాయణ గురు ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. కౌన్సిల్ ఛైర్మెన్‌గా తన పదవి కాలం ముగిసినప్పుటి నుంచి స్వామి గౌడ్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడం లేదు.
Read More: కరోనాకు అదొక్కటే మందు.. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది: మంత్రి ఈటల
ఇప్పుడు ఈ కామెంట్ లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పక్ష నాయకులు పై స్వామిగౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషణ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని స్వామిగౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చాలా రోజుల తర్వాత ఆయన ఇలా తనలో ఉన్న ఆవేదనను బయటకు చెప్పారని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. శ్రీ నారాయణగురు జయంతి వేడుకల్లో స్వామిగౌడ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.