యాప్నగరం

గోల్కొండలో గన్‌తో టీఆర్ఎస్ నేతల హల్‌చల్.. బీజేపీతో వాగ్వాదం

టీఆర్ఎస్‌ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Samayam Telugu 30 Nov 2020, 8:59 am
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పుడు నగరంలో డబ్బుల పంపిణీ కలకలం మొదలయ్యింది. ఓవైపు ప్రతిపక్షాలు అధికార పక్షం డబ్బులు పంచుతుందని ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి బారాదరిలో టిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు డబ్బుల పంపిణీ చేస్తున్నారని సమాచారంతో అక్కడికి బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
Samayam Telugu గన్‌తో టీఆర్ఎస్ నేతల హల్ చల్
trs leader with gun


Read More: బెట్టింగుల కోసం దారుణం.. తల్లి సోదరికి విషం పెట్టిన యువకుడు

ఎన్నికల ప్రచారం ముగిశాక టీఆర్ఎస్ నేతలు ఎందుకు వచ్చారంటూ బీజేపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. చాయ్ తాగడానికి వచ్చామని వారి చెప్పినా వినలేదు. యాకూబ్ రెడ్డి అనే టిఆర్ఎస్ నేత వెంట ఉన్న ఓ వ్యక్తి వద్దా రివాల్వర్ గమనించిన బీజేపీ నేతలు హడలిపోయారు. గన్‌కు లైసెన్స్ చూపించాలంటూ నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప జేశారు. బిజెపి నేతలు మాట్లాడుతూ పోలీసులు వారికి తొత్తులుగా మారారని వాపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.