యాప్నగరం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జర్మనీ పౌరుడే... మరో అవకాశం ఇచ్చిన హైకోర్టు

ఎంబసీ నుంచి అసవరమైన వివరాలు రాబట్టలేకపోతే మీరు మీ హోదాలు ఎందుకు అంటూ... కేంద్ర హోంశాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Samayam Telugu 16 Dec 2020, 3:02 pm
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై హై కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయలేదు. కేవలం మోమో దాఖలు చేసింది. దీంతో కేంద్రం తీరుపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. చెన్నమనేని రమష్ పౌరసత్వం పై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18 న కేంద్ర హోం శాఖ ను హై కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకుండా కేవలం మోమో మాత్రమే దాఖలు చేయడంపై హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samayam Telugu టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని
trs mla chennamaneni


ఎంబసీ నుండి పౌరుని వివరాలు రబట్టలేక పోతే ఎందుకు మీ హోదాలు అంటూ న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఫిబ్రవరి 2020 లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమో నే మళ్ళీ ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో మారు అవకాశం ఇస్తున్నాం జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది.

Read More: టీపీసీసీ చీఫ్ ఎంపికలో ఉత్కంఠ... సోనియాను కలిసిన కోమటిరెడ్డి

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో విచారణ జరిగింది. జర్మనీ పౌరసత్వాన్ని రమేష్ 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే, దీన్ని అఫిడవిట్ రూపంలో కాకుండా మెమో రూపంలో వివరాలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.