యాప్నగరం

ఒక నాగలి, రెండు ఎద్దులు.. ఇచ్చాడా రఘునందన్?? దొంగ హామీ!!

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ని టార్గెట్ చేశారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. దుబ్బాక ఎన్నికల సమయంలో దొంగ హామీ ఇచ్చారని.. రైతులారా హామీ నెరవేర్చాడా? అంటూ ఎద్దేవా చేశారు.

Samayam Telugu 18 Sep 2021, 8:14 pm
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇప్పటి వరకూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరాలతో ప్రభుత్వంపై కత్తులు దూస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్ కూడా కదనరంగంలోకి దూకింది. ఇప్పటి వరకూ కొంత సంయమనంగా వ్యవహరించిన నేతలు నేరుగా బీజేపీ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
raghunandan


ఆయన బాటలోనే నడిచారు ఆ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. బీజేపీ కొత్త ఎమ్మెల్యేకి ఆయన ఇచ్చిన హామీతోనే షాకిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునందన్ రావు రైతన్నలకి ఇచ్చిన హామీని గుర్తు చేశారు. బీజేపీని గెలిపిస్తే ప్రతి రైతు కుటుంబానికి ఒక నాగలి, రెండు ఎద్దులు ఇస్తామని రఘునందర్ హామీ ఇచ్చిన వీడియోని ట్వీట్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రతి రైతుకి నాగలి, రెండు ఎడ్లు ఇస్తానని రఘునందన్ హామీ ఇచ్చారని.. దుబ్బాక రైతన్నలారా ఇచ్చారా మరి?? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీ కోసం వెయ్యి అబద్ధాలు చెప్పారని.. దొంగ హామీ తాజాగా బయటపడిందంటూ ఎద్దేవా చేశారు.



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.