యాప్నగరం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫ్యామిలీని వదలని కరోనా..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుటుంబాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఎమ్మెల్యే, ఆయన భార్య కరోనాా నుంచి కోలుకోగా... ఆయన కొడుకు, కోడలికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

Samayam Telugu 20 Jul 2020, 1:20 pm
జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుటుంబాన్ని కరోనా వెంటాడుతోంది. జూన్ నెలలో ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య, గన్‌మెనన్, డ్రైవర్, వంటమనిషికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. చికిత్స అనంతరం వీరింతా కోలుకున్నారు. వీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ముత్తిరెడ్డ ఇంట్లో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఈసారి ఆయన కుమారుడు, కోడలు కోవిడ్ బారిన పడ్డారు.
Samayam Telugu ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
muthireddy yadagiri reddy


యాదగిరి రెడ్డి హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. జూలై 18న ఆయన కొడుకు, కోడలికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరికి కరోనా సోకుతుండటంతో.. ఎమ్మెల్యే ఫ్యామిలీతోపాటు అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలో కరోనా బారిన పడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనే సంగతి తెలిసిందే. ఈయన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కోవిడ్ సోకినట్లు తేలింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. హోం మంత్రి మహమూద్ అలీ కూడా కరోనా నుంచి రికవర్ అయ్యారు.

ఇటీవలే మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఆయన భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా వచ్చింది. వీరంతా హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.