యాప్నగరం

గవర్నర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తొందరపాటు ట్వీట్.. ఆ వెంటనే డిలీట్

Telangana governor: మంగళవారం గవర్నర్ తమిళిసై ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 19 Aug 2020, 3:19 pm
గవర్నర్ తమిళసై గురించి చేసిన ఓ ట్వీట్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తన ట్విటర్ ఖాతా నుంచి డిలీట్ చేశారు. బీజేపీ అధ్యక్షురాలిగా గవర్నర్ వ్యవరించొద్దంటూ తమిళిసైని ఉద్దేశించి సైదిరెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. అయితే, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే సైదిరెడ్డి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ చేస్తున్న విమర్శలకు స్పందించవద్దని గతంలోనే సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. గవర్నర్ విషయంలోనూ అదే వైఖరి అవలంబించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu గవర్నర్ తమిళిసై (ఫైల్ ఫోటో)
tamilisai saunderarajan


మంగళవారం గవర్నర్ తమిళిసై ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణలో ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ మెరుగ్గా వ్యవహరించలేదని అన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తీరును ప్రభుత్వం అంచనా వేయలేకపోతోందని విమర్శలు చేశారు. కరోనా తీవ్రత, వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరించామని, సూచనలు చేశామని, ఇంకా ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని తమిళిసై విమర్శలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.