యాప్నగరం

రోడ్డు పనులు చేసిన ఎమ్మెల్యే.. స్వయంగా పార చేత పట్టి

వర్షం కారణంగా ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. భాగ్యనగరంలో కూడా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెళ్తున్న రోడ్డుపై బురద పేరుకుపోయింది.

Samayam Telugu 10 Oct 2020, 12:46 pm
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వాన నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు వానలకు రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి అటుగా వెళ్లే వాహనదారులకు నరకయాతన పడుతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి గుంతలు రోడ్లు చూసిన ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా రోడ్డుపై ఉన్న గుంతల్ని పూడ్చి పెట్టారు.
Samayam Telugu టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్
trs mla shankar nayak


Read More: హైదరాబాద్‌లో భారీ వర్షానికి హైకోర్టు ఉద్యోగి మృతి

మహబూబాబాద్ మండలంలోని మాల్యాల గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌.. బేథోల్ మీదుగా వెళ్తున్నారు. అయితే అక్కడ రోడ్డు బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చూసిన ఎమ్మెల్యే రోడ్డు మరమ్మతులకు నడుం బిగించారు. వెంటనే రెండు టిప్పర్ల డస్ట్‌ను తెప్పించారు. బురదతో పేరుకుపోయిన రోడ్డుపై డస్ట్ పోయించారు. అక్కడ మరమ్మతులు చేపట్టారు. ఎమ్మెల్యేనే స్వయంగా పార చేతపట్టి పనిలో నిమగ్నమయ్యారు. గుంతలను పూడ్చారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టినందుకు ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.