యాప్నగరం

TRS ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా బారిన పడిన ప్రజాప్రతినిధుల జాబితాలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ చేరారు. ఆయన భార్య, కుమారుడికి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Samayam Telugu 10 Aug 2020, 9:50 am
తెలంగాణలో కరోనా బారిన పడిన ప్రజాప్రతినిధుల జాబితాలో మరొకరు చేరారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్ అని తేలగా.. తాజాగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్‌కు కోవిడ్ సోకినట్లు తేలింది. ఎమ్మెల్సీ సతీమణి, కుమారుడికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ ఎమ్మెల్సీ సహా ఆయన కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారు. దీంతో ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
Samayam Telugu corona
Representative image


గంగాధర్ గౌడ్ ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరారని తెలియడంతో గంగాధర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకున్నారు. ఎమ్మెల్సీ కోడలు, సిబ్బందికి నెగటివ్ అని తేలింది.

తెలంగాణలో ఆదివారం 1256 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ జిల్లాలో 33 మంది కోవిడ్ ఉన్నట్లు తేలింది. గత వారం వ్యవధిలో జిల్లాలో ఇంత తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.