యాప్నగరం

టీఆర్ఎస్‌కు మళ్లీ బీజేపీ షాక్! కమలం వైపు ఎమ్మెల్సీ చూపు, రహస్యంగా భేటీ?

Nagarjuna Sagar: తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం.

Samayam Telugu 28 Jan 2021, 8:09 pm
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్, కాంగ్రెస్ మహిళా నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విశాయశాంతి కషాయ కండువా కప్పుకున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bjp flag kcr


తాజాగా అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ రహస్య ప్రదేశంలో బీజేపీ ముఖ్య నేతలను ఎమ్మెల్సీ చిన్నప రెడ్డి కలిసినట్లు సమాచారం. నాగార్జున సాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉంటానని చిన్నపరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

తేరా చిన్నపరెడ్డి నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో పోలిస్తే బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో తమకు అనుకూలంగా వీస్తున్న రాజకీయ పవనాలను వాడుకొని నాగార్జునసాగర్‌లో ఆధిక్యం సాధించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.