యాప్నగరం

పార్లమెంట్‌లో ఎంపీ కేకేకు కీలక బాధ్యతలు.. సీఎం కేసీఆర్ అభినందనలు

TRS పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావుకు కీలక బాధ్యతలు దక్కాయి. పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఎంపీ నియామకం. సీఎం కేసీఆర్ హర్షం.

Samayam Telugu 14 Sep 2019, 6:27 pm
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు (కేకే)కు పార్లమెంట్‌లో కీలక బాధ్యతలు దక్కాయి. పరిశ్రమల విభాగం పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా ఆయణ్ని నియమించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ శనివారం (సెప్టెంబర్ 14) ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 21 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. వీరికి కేశవరావు నేతృత్వం వహిస్తారు.
Samayam Telugu keshav Rao


లోక్‌సభలో ప్రాధాన్యం ఉన్న కమిటీకి తనను ఛైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తనను ఛైర్మన్‌గా నియమించిన విషయాన్ని తెలిపారు. కేశవరావుకు అభినందనలు చెప్పిన కేసీఆర్.. ఆయణ్ని శాలువా కప్పి సన్మానించారు.

Don't Miss: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు

అటు వాణిజ్యంపై పార్లమెంటరీ కమిటీకి వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత శ్రీ విజయసాయి రెడ్డి ఎంపికయ్యారు. ఈ కమిటీలోనూ 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.