టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈడీ నోటీసులపై తొలిసారిగా స్పందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా టీఆర్ఎస్లోనే ఉంటానన్నారు నామా. తన బలం కేసీఆర్, ఖమ్మం ప్రజలే అన్నారు ఎంపీ. గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నానన్న నామా తమ కంపెనీలు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టయన్నారు. ఏ కంపెనీలో తాను డైరెక్టర్గా లేనన్నారు ఎంపీ నామా నాగేశ్వర్రావు. 40 ఏళ్ల క్రితమే మధుకాన్ను స్థాపించానని తెలిపారు. రాంచీ ఎక్స్ప్రెస్వే ఎస్పీవీ కంపెనీ BOT పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టిందన్నారు. నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చిందన్నారు. కానీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. ఎస్క్రో అకౌంట్ పై బ్యాంకర్ కే పూర్తి పవర్ ఉందని.. విచారణకుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునల్ లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. తాను డైరెక్టర్గా లేకపోయినా ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించడానికి అసలు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.
జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.