యాప్నగరం

KCR: గులాబీ బాస్ అలెర్ట్.. జిల్లాలకు సారథుల నియామకం అందుకేనా?

వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గులాబీ బాస్ కేసీఆర్ అప్రమత్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాలకు సారథులను నియమించింది.

Samayam Telugu 26 Jan 2022, 2:12 pm
వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గులాబీ బాస్ కేసీఆర్ అప్రమత్తం అవుతున్నారు. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న వేళ.. అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు సారథులను నియమించింది. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది..
Samayam Telugu కేసీఆర్


ఇందులో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించడం గమనార్హం. ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ చైర్మన్లు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కాయి.

ఇక కేసీఆర్ ఫ్యామిలీకి నమ్మిన బంటు లాంటి బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా బాధ్యతలను ఎంపీ కవితకు కట్టబెట్టారు.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి.. అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.

అయితే కేసీఆర్ ఫ్యామిలీకి విశ్వసనీయంగా ఉండటంతో పాటు.. జిల్లాల్లో పట్టున్న నేతలు, వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడపగల సత్తా ఉన్న వారికే అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని ఈ జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చని కేసీఆర్.. ఈసారి స్థానికంగా ప్రతికూలత ఉన్న వారికి టికెట్ నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.